తమిళ హీరో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను నాగార్జున పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఫొటోలు షేర్ చేశారు. అలాగే సినిమా ప్రమోషన్స్ను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. కాగా, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది.