ADB: హిందూ, ముస్లింలందరు నదుల సంగమం వలే కలసి మెలసి ఉండాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ముస్లింలందరు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.