నంద్యాల: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో వడ్డేపేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తి భావనపై జెకెఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జెఎస్ఎస్ బ్రహ్మానంద చారి సదస్సు ఏర్పాటు చేశారు. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి భావన అలవర్చుకోవాలని తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ ఇష్ట దైవానికి కేటాయించాలని కోరారు.