RR: గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించి, నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.