SRPT: హోళీ పండుగను సహజ సిద్ధమైన రంగులతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల ప్రజలకు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం చేయరాదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.