ADB: భీంపూర్ మండల కేంద్రంలో ఈనెల 7న సోయా కొనుగోళ్లు నిలిపివేసినట్లు సెంటర్ ఇంఛార్జ్ కేశవ్ గురువారం తెలియజేశారు. సోయా నిల్వలు అధికంగా ఉన్నందున కొనుగోలు నిలిపివేయడం జరిగిందన్నారు. ఇవాళ తర్వాత కొనుగోలు తేదీని ఒకరోజు ముందుగానే తెలియజేస్తామని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.