NRML: ఖానాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో పాస్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఆ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యేసుక్రీస్తు అందించిన శాంతి బోధనలు అందరికీ ఆచరణీయమన్నారు.