BDK: ప్రాజెక్టు అధికారి టేకులపల్లిలో గ్రంథాలయ భవనాన్ని కట్టిస్తామని పీవో రాహుల్ చెప్పారు. టేకులపల్లి శాఖ గ్రంథాలయాన్ని శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సందర్శించారు. స్థానిక గ్రంథాలయాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారితో గ్రంథ పాలకుడు నాగన్న పాల్గొన్నారు.