BHPL: కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలను వెంటనే పర్మినెంట్ చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన ధర్నాకు టీఎన్జీవోస్ నేతలు రవిగౌడ్, సురేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.