MNCL: కోల్పోయిన ఉనికి కాపాడుకోవడానికే BRS నాయకులు బాకీ కార్డులని ఊరూరా తిరుగుతున్నారని కాసిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ.. గడిచిన 10 ఏళ్ళు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ప్రజలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్, రేషన్ కార్డ్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తుందన్నారు.