MDK: రామాయంపేట మున్సిపాలిటీలో ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మోతుకు చంద్రమౌళి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చంద్రమౌళి విద్యార్థులకు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన కుటుంబానికి అన్ని వేళలా తోడుగా ఉంటామని పద్మాదేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.