MDK: ఘనపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెచ్ఎంగా దొడ్ల అవంతిక, ఎంఈవోగా ఆకుల శ్రీనివాస్, డీఈవోగా సాయిచరణ్ వ్యవహరించారు. పిల్లలు పాఠాలు బోధిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం సుజాత బహుమతులు అందజేశారు.