MDK: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకం అమలులో జాప్యం జరుగుతుండటంతో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదారు నెలలుగా ఎఫ్సీఐ (FCI) గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా సకాలంలో కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున అందాల్సిన బియ్యం, 7వ తారీఖు దాటినా అందడంలేదన్నారు.