RR: శబరిమల యాత్ర కోసం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప భక్తుల ఇరుముడిని క్యాబిన్ బ్యాగ్లో తీసుకెళ్లడానికి ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతించడం లేదు. యాత్రికులు ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్లో మాత్రమే ఉంచాలన్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు భక్తులు ముందస్తుగా ఈ నిబంధనను పాటించాలని కొందరు స్వాములు కోరారు.