WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం బాల్య శశిరేఖ ఈ నెల 20న నర్సంపేటలోని కుమార్తె ఇంటికి వెళ్లగా, గురువారం ఇంటి తాళం పగులగొట్టినట్లు గుర్తించారు. బీరువాలో ఉన్న 60 తులాల వెండి, 10 గ్రాముల బంగారం అపహరించబడింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.