HNK: కాజీపేట మండలం సోమిడి గ్రామ శివారులోని వెంచర్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజలు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయ శ్రీ పాల్గొన్నారు.