SRD: కల్లు గీత కార్మికులకు బడ్జెట్లో రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డిలో కలెక్టర్ ప్రావీణ్యకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.