SDPT: చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన తుంగ పోషవ్వ ఇల్లు శిథిలావస్థకు చేరి ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో పెంకుటిల్లు కూలిపోవడంతో అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకుంది. వృద్ధాప్యంతో ఉన్న పోషవ్వ ఏ పని చేయలేక పింఛనుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇల్లు కూలిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యింది. అధికారులు స్పందించి ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది.