KMR: బిచ్కుంద, మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు కళాశాల ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. బిచ్కుంద కళాశాలలో ఆంగ్లం, అర్థశాస్త్రం, మద్నూర్ కళాశాలలో తెలుగు, ఆంగ్లం, బొటని, జూవాలజీ, కెమిస్ట్రీ పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆయా సబ్జెక్టులలో పీజీలో 55% మార్కులు అర్హత కలిగి ఉండాలన్నారు.