KMM: కారేపల్లి బోటితండా పంచాయతీ ఇంఛార్జ్ సర్పంచ్గా ఉప సర్పంచ్ బాదావత్ మంగీలాల్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సర్పంచ్ భూక్యా తులిశ్యా మృతి చెందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. శుక్రవారం ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మంగీలాల్ను కలిసి ఇంఛార్జ్ సర్పంచ్ నియామక ఉత్తర్వులను అందజేశారు. జాయింట్ సిగ్నేచర్ అధికారాన్ని వార్డ్ మెంబర్ మంగికి కల్పించారు.