KMM: అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను మండల కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికిగాను ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందాలనుకునేవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.