KNR: మానకొండూర్ మండల కేంద్రంలోని మసీదులో పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామరస్యాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. మైనారిటీ ల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముస్లిం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.