BHPL: టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య-కనకమ్మ దంపతులకు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్ సంతానం. వీరిలో సారయ్య 1989లో, రవి (ఉదయ్) 1992లో, అశోక్ (ఐతు) 1994లో నక్సలైట్లలో చేరారు. 2015లో అశోక్ (ఐతు) అనారోగ్యంతో పోలీసులకు లొంగిపోయాడు. నేడు రవి (ఉదయ్) ఎన్కౌంటర్లో మృతి చెందాడు. కాగా ఒకే కుటుంబంలో ముగ్గురు నక్సల్స్ బాట పట్టారు.