BHPL: మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతి గదుల సౌకర్యాలు, భోజన వసతులు, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. తనిఖీ అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో సంభాషించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.