ADB: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఏడాది కాలంలో 200 కేసులు నమోదు చేసి, 1000 మందిని జైలుకు పంపినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుల్లో యువతే ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని, గంజాయికి బానిసై బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.