SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద శుక్రవారం యూరియా కోసం మహిళలు బారులు తీరారు. నెల రోజులుగా ఇంటి పనులు మానుకొని, రోజులు తరబడి క్యూ లైన్లో నిలబడే పరిస్థితి ఏర్పడిందని మహిళ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా సప్లై చేయాలన్నారు.