NGKL: ఊర్కొండ మండలం మాధారం గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి, అనుమతి లేకుండా కంచె (కడ్డీలు) వేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు రవిశంకర్ ఫిర్యాదు మేరకు సుమారు 21 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు ఎస్సై కృష్ణదేవ సోమవారం తెలిపారు.