KMR: ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకుని, వారి వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు. సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు ఉన్నారు.