MLG: బామ్మర్ది మరణ వార్త విని బావ గుండెపోటుతో మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలంలో జరిగింది. నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ బావ ఎల్లయ్య తాడ్వాయి మండలంలోని నరసింగాపురం గ్రామంలో బుధవారం గుండెపోటుతో మరణించాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.