SDPT: చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాలను శనివారం జిల్లా స్థాయి ప్యానల్ తనిఖీ బృందం పద్మారెడ్డి, నాగేందర్, లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలను, ఉపాధ్యాయుల మోడల్ లెసన్స్, విద్యార్థుల అభ్యసన స్థాయిని, పాఠశాల రికార్డులు, హాజరు నమోదు, విద్యా ప్రణాళికలను పరిశీలించారు.