SDPT: అక్కన్నపేట(M) మల్లంపల్లిలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తికాకముందే తలుపులు, కిటికీలు ఊడిపోయి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.