KMR: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 17న శుక్రవారం సీజీ ఆర్ఎఫ్ – 2 ఛైర్పర్సన్ ఎరుకల నారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ ఉపకేంద్రం మేనూర్లో నిర్వహిస్తున్నట్లు బిచ్కుంద ఏడీఈ సంజీవరావు గురువారం తెలిపారు. బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లి మండలాల విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు.