PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ కూడా అంతే ఉంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 2614 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా, ఇరిగేషన్ అధికారులు అదే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో 4 గేట్లు ఎత్తి 2296 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.