WNP: ఇంటర్ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య బుధవారం తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఐఈవో ఆకస్మిక తనిఖీ చేసి, విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందిస్తున్నట్లు ధృవీకరించారు.