BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన నగదు బంగారం వెండి ఇతర కానుకల పూర్తి వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని ఈవో తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.