SRD: కంగ్టి మండల ఎంపీపీ సమావేశం మందిరంలో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండల పరిధిలోని పార్టీల నాయకులు విధిగా హాజరుకావాలని కోరారు. స్థానిక ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.