ADB: గుడిహత్నూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈద్గా, ఖబ్రస్థాన్ అభివృద్దికి రూ.5 లక్షలు కేటాయించినందుకు గాను ముస్లింలు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని గజేందర్ పేర్కొన్నారు.