KMM: నగరంలోని 46వ డివిజన్లో కార్పొరేటర్ కన్నం వైష్ణవి-ప్రసన్నకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ‘ఓట్ చోర్ గద్దె చోడ్’ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావేద్ పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని, ఈ ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారని తెలిపారు.