ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో బుధవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందోత్సాహాలతో కాలనీలో తిరుగుతూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజు నాయక్, గండ్రకోట కుమార్, కొట్టే రాజిరెడ్డి, నాగేశ్వరరావు, సుధాకర్, సాంబశివ, కాలనీ వాసులు పాల్గొన్నారు.