MDCL: ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో హలీం విక్రయాలు నిన్న జోరుగా కొనసాగాయి. రంజాన్ మాసం చివరి రోజు కావడంతో హలీం కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రముఖ హోటళ్లు, స్టాళ్ల వద్ద కస్టమర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూశారు. ప్రత్యేక రుచితో ప్రసిద్ధి చెందిన హలీం కోసం యువతతో పాటు కుటుంబాలు కూడా ఆసక్తి చూపారు.