SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామ వాటర్ మెన్ బాలయ్య తన కుటుంబంతో కలిసి సోమవారం MPDO ఆఫీసు ముట్టడించారు. గత 4 నెలల నుంచి జీతం ఇవ్వడం లేదని, తమ పట్ల సర్పంచ్ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక పస్తులతో ఉన్నామన్నారు. వేతనం ఇవ్వకపోతే ఇక్కడే పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. బాలయ్యకు వేతనం అందించే చర్యలు తీసుకుంటామని MPO తెలిపారు.