MHBD: జిల్లా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అనిల్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రవి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, గురుకుల పాఠశాల సమస్యలపై అధికారులు స్పందించాలని అదనపు కలెక్టర్ కోరినట్లు తెలిపారు.