SRCL: గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగ అక్షయ్ కుమార్ రెడ్డి గ్రూప్-1 ఫలితాల్లో 228వ ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీఎం చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయినా, తల్లి రేణుక ప్రోత్సాహంతో, MA పట్టాలు పొంది, పట్టుదలతో ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు.