JN: పాలకుర్తి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి నవతెలంగాణ 2025 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. నవతెలంగాణ పత్రిక సమాజానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో ముందుంటుందని, ప్రజా సమస్యలను ప్రజాస్వామ్య విధానాల్లో తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.