BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో గోదావరి వరద ప్రవాహానికి పత్తి, వరి పంటలు నీటా మునిగి తీవ్రంగా నష్టపోయినట్లు రైతు గంగరాజు యాదవ్ మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీట మునిగి తీవ్ర నష్టం కలిగించిందని రైతు తెలిపారు. ప్రభుత్వం తమను రక్షించాలని వేడుకున్నారు.