VKB: భానుడి ప్రతాపం అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక బయటికి రాని పరిస్థితి ఉన్నప్పటికీ తప్పనిసరిగా బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వారంలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.