NGKL: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చారకొండ మండలం సిర్సనగండ్లలో 84.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొల్లంపల్లి 37.5 మి.మీ, బిజినపల్లి 36.3 మి.మీ, పాలెం 35.3, తూడుకూర్తి 23.0 మి.మీ, వెల్దండ 12.8, కల్వకుర్తి 10.5 మి.మీ, నాగర్ కర్నూల్ 2.8, తోటపల్లి 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.