వనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైకును ఢీకొట్టిన ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ హెమంత్ (19) అనే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు NGKL జిల్లాకు చెందిన వాడిగా గుర్తింపు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.