MDK: బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఎస్హెచ్ఓ లకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి సమస్యలు నేరుగా విని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి పైరవులకు తావు లేకుండా సంప్రదించాలని సూచించారు.