NLG: నార్కట్పల్లి శివారులో రైలు కింద పడి కొండకింది హరీష్ రెడ్డి (28) అనే యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిట్యాల మండలం ఎలికట్టెకు చెందినవాడు. ఉన్నత చదువులు చదివినా ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.